గొరగనమూడిలో వైఎస్ ఆలయం
ఏలూరు : గొరగనమూడిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమానులు, డ్వాక్రా మహిళలు కలసి ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందులో వైఎస్ చిత్రపటం పెట్టి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేయనున్నారు. ఈ ఆలయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, డీసీసీ అధ్యక్షుడు కొయ్యే మోహేన్ రాజు, మార్కెట్ యార్డ్ వైఎస్ చైర్మన్ మేడిదిజాన్సన్ తదితరులు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్న మహిళలు, యువజన సంఘాల సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News Posted: 9 September, 2009
|