ఒంగోలు : ఒంగోలు లోని ప్రగతినగర్ కాలనీలో గురువారం జరిగిన ప్రమాదంలో 30 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. ఎగిసిపడుతున్న మంటలకు ఎండ తోడై మరిన్ని సిలిండర్లు పేలడంతో మరికొన్ని ఇళ్ళు దగ్ధమైపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో గొడవపడి ఓ గుడిసెకు నిప్పు అటించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.