తిరుపతి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హస్తం గుర్తును రూపొందించిన సైఫుల్లా బేగ్ (80) గురువారం తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే నాయకుడు బేగ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన మదనపల్లిలో ఈ రోజు ఉదయం మరణించారు. ఇందిరాగాంధీ కుటుంబానికి సైఫుల్లా ఎంతో ఆప్తుడు.