గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కు పాల్పడుతున్న 11 మంది విద్యార్థులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్ళుగా సీనియర్లు తమను వేధిస్తున్నారంటూ జూనియర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో యాజమాన్యం కల్పించుకున్నా గొడవలు సద్దుమగణక పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ర్యాగింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో జూనియర్లు ఆందోళన విరమించుకున్నారు.