వరంగల్ : విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సును వనవిజ్ఞాన కేంద్రం వద్ద ఓ లారీ ఢీకొనడంతో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని హన్మకొండ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.