20న విగ్రహ ప్రతిష్ఠ
విజయవాడ : యనమలకుదురు కృష్ణానది సమీపాన వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పార్వతి, విఘ్నేశ్వరస్వామి విగ్రహప్రతిష్ట, రాజగోపురాల కలశ ప్రతిష్ట కార్యక్రమాలు ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. విలేఖరుల సమావేశం కార్యనిర్వాహణాధికారి సుబ్రహ్మణ్యం ఆదివారం మాట్లాడారు. చారిత్రక పుణ్యక్షేత్రంగా యనమలకుదురు 'మునిగిరి' దేవాలయం ప్రసిద్ధి పొందిందన్నారు. ఈనెల 20 నుంచి 24 వరకు ప్రాంచాగ్నికంగా ప్రతిష్ట, మహాకలశాభిషేక మహోత్సవాలను విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News Posted: 14 September, 2009
|