స్వైన్ ఫ్లూతో విద్యార్థి మృతి
వరంగల్ : రాష్ట్రమంతటా శరవేగంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ వ్యాధి వల్ల ఓ విద్యార్థి బుధవారం మరణించినట్లు భారీనీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హెచ్1ఎన్1 వైరస్ సోకి స్థానిక ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టెన్త్క్లాస్ విద్యార్థి సాయికృష్ణ మరణించినట్లు ఎంజిఎం ఆసుపత్రి వర్గాలు ధృవీకరించినట్లు ఆయన చెప్పారు. స్వైన్ ఫ్లూ, డెంగీ వంటి వ్యాధులు వ్యాప్తిపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. రోగులకు ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరో వారం రోజులలో మేడారం సమ్మక్క - సారక్క జాతర ఏర్పాట్లు ముమ్మరం చేశామని ఆయన చెప్పారు.
News Posted: 16 September, 2009
|