అమ్మవారి ఆభరణాలు చోరీ
ఏలూరు : పవరుపేటలోని గంగానమ్మ అమ్మవారి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి అలంకరించిన ఆభరణాలు చోరీ కాబడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున దుండగులు అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటం, వెండి చేయిని దొంగలు అపహరించారు. వీటి విలువ సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఉంటుందని ఆలయన వర్గాలు తెలిపాయి. పవరుపేట రైల్వేస్టేషన్ సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఈ ఆలయం ఉన్నది. అమ్మవారికి జాతర సమయంలో అలంకరించిన ఈ ఆ భరణాలను జాతర అయిన మూడు రోజుల తర్వాత తీసి భద్రపరుస్తామని వారు చెప్పారు. అమ్మవారి ఆభరణాలు చోరీకి గురవడం పట్ల కమిటీ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 16 September, 2009
|