గుంటూరు : రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ జిల్లాలకూ శరవేంగంగా విస్తరిస్తోంది. తాజాగా గుంటూరు కృష్ణానగర్ లోని ఓ వివాహిత మహిళకు స్వైన్ ఫ్లూ సోకడంతో ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందుతోంది. ఆమె భర్త ఉస్మానియా ఆస్పత్రిలో నెఫ్రాలజిస్టుగా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఆయనకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇటీవల స్వస్థలానికి వచ్చి వెళ్ళిన ఆయన ద్వారా ఆమెకు ఈ వ్యాది సోకినట్లు వైద్యులు నిర్థారించారు. ఆమె నాలుగేళ్ళ కుమారునితో సహా మిగిలిన వారికి ఈ లక్షణాలు సోకలేదని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి స్వైన్ ఫ్లూ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.