శ్రీశైలంలో రుద్రయాగం
కర్నూలు : ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రమల్లికార్జునస్వామి, భ్రమరాంభికా దేవి ఆలయంలో సోమవారం రుద్రయాగం, చంఢీయాగం కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వేదపండితులు పాల్గొని యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ యాగాలను చూసి భక్తులు తరిస్తున్నారు. శ్రీశైల భ్రమరాంభికా దేవి నేడు అన్నపూర్ణగా భక్తుల పూజలందుకుంటోంది. శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. నవరాత్రులలో రెండో రోజున శ్రీదేవి బ్రహ్మచారిణి అలంకారంతో పూజలందుకుంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి శ్రీచక్రార్చన, నవావరమార్చనలు, చంఢీయాగంగ నవగ్రహ జపానుష్ఠానములు, పంచాక్షరీ, బాల, గణపతి మహామంత్రానుష్టానములు, చంఢీపారాయణ, వేద పారాయణలు, సూర్యనమస్కారాలు, కుమారి పూజలు జరిగాయి. శ్రీమల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రభాషేకం, రుద్రహోమం, రుద్రయాగంగ జపములు, పారాయణలు నిర్వహించారు.
News Posted: 21 September, 2009
|