విజయవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనక దుర్గమ్మవారికి ఓ భక్తుడు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. దశరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు బెంగుళూరు నుంచి వచ్చిన భక్తుడు మంజునాథ్ అమ్మవారికి రూ. లక్షన్నర విలువ చేసే హారాన్ని కానుకగా సమర్పించారు. శరన్నవరాత్రులలో మూడోరోజైన సోమవారం అన్నపూర్ణగా అలంకరించిన అమ్మవారిని మంజునాథ్ దర్శించుకుని తన మొక్కును తీర్చుకున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది.