తిరుపతి : స్థానిక రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్ ఫ్లూ బాధితుడు సోమవారం అదృశ్యం అయ్యాడు. ఈ సంఘటనతో ఆసపత్రిలో కలకలం రేగింది. అనునిత్యం భక్తులతో అలరారే తిరుపతిలో స్వైన్ ఫ్లూ రోగి జనసామాన్యంలో తిరుగుతున్నాడన్న వార్త సర్వత్రా భయాందోళనలకు గురిచేస్తోంది. వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని స్వైన్ ఫ్లూ రోగి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.