తిరుమలలో పుష్ప ప్రదర్శన
తిరుపతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తిరుపల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనను దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఫోటో ఎగ్జిబిషన్ ను అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సాయంత్రం 6.30 గంటల మధ్య మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రోశయ్య సమర్పించనున్నారు. తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీవారిని పెద్ద శేష వాహనంలో తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులుకు దర్శనమీయనున్నారు.
News Posted: 21 September, 2009
|