ముస్తాబైన తిరుమల
తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల వీధులు ముస్తాబయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు మీనలగ్నం ముహూర్తంలో ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రోశయ్య స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనిమిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నందున తిరుమల నాలుగు మాడవీధులలో గ్యాలరీలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. నాలుగు వేలమంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్య కూడళ్లలో 50 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. ఊరేగింపు జరిగే మాడవీధుల్లో భక్తులు శ్రీవారిని ధర్శించుకునేందుకు ప్రత్యేకమైన డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలకరణతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు.
News Posted: 21 September, 2009
|