అమ్మవారికి దత్ విరాళం
విజయవాడ : శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. దేవీ నవరాత్రుల సందర్బంగా విజయవాడ కనకదుర్గమ్మను నేడు అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ గుడిలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి 5 లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ అధికారులకు అందజేశారు. శరన్నవరాత్రుల సందర్బంగా అమ్మవారిని రాష్ట్ర ఎంపీ రాయపాటి సాంబశివరావు, నిర్మాత అశ్వనీ దత్ సోమవారం దర్శించుకున్నారు.
News Posted: 21 September, 2009
|