జగన్ అభిమానుల దీక్షలు
అనంతపురం : వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇంకా తేలకపోవడంతో వైఎస్ అభిమానులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు నేటికి మూడోరుజుకు చేరుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందడంతో ఆయన కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆందోళనలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో యువజన కాంగ్రెస్, జగన్ అభిమానులు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని చేయాలంటూ ఈ దీక్షలు చేపట్టారు.
News Posted: 21 September, 2009
|