విజయవాడ : దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా పండుగ రోజున నిర్వహించే తెప్పోత్సవానికి గాను హంసవాహనం ముస్తాబవుతోంది. ఈ హంసవాహనంపై అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనానికి రంగులు దిద్దే పనులు పూర్తి కావచ్చాయి. నాలుగు రోజుల్లో హంసవాహనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు హంసవాహనాన్ని సిద్ధం చేస్తున్న నిర్వాహకులు తెలిపారు. ముందస్తు చర్యగా అధికారులు రెండు రోజుల్లో హంసవాహనాన్ని నదిలో ట్రైల్ రన్ నిర్వహించనున్నారు.