శ్రీవారి సేవ పూర్వ జన్మ సుకృతం
తిరుమల : శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి సేవ చేయడం పూర్వ జన్మ సుకృతమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి సేవకులు 2100 మంది తిరుమలకు చేరుకున్నారు. స్థానిక ఆస్థాన మండపంలో సోమవారం శ్రీవారి సేవకులనుద్దేశించి వెంకటరెడ్డి ప్రసంగించారు. సేవకులంతా భక్తి శ్రద్ధలతో శ్రీవారి సేవ చేయాలని సూచించారు. భక్తుల పట్ల సభ్యతతో మెలగాలని కోరారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవులునాయుడు, ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్ వో రామకృష్ణ పాల్గొని వెంకన్న సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన అద్భుతంగా ఉందని వారు కొనియాడారు.
News Posted: 22 September, 2009
|