గాయత్రిగా అంబికాదేవి
ఏలూరు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక సత్రంపాడులో వేంచేసియున్న అంబికాదేవిని అర్చకులు గాయత్రీ మాతగా అలంకరించారు. గాయత్రీ దేవి రూపంలో అంబికాదేవి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నవరాత్రుల్లో మూడోరోజున అంబికాదేవి అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారాన్ని వీక్షించినవారికి అన్నవస్త్రాలకు లోటు ఉండదని, అర్చన చేసినవారికి సుభిక్షం కలుగుతుందని విశాఖ శారదా పీఠ పాలిత అంబికా దైవసన్నిధానం ట్రస్టు కన్వీనరు అంబికా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా విశేష పూజలను అంబికా రామాంజనేయులు, అంబికా సుదర్శన్, అంబికా రామచంద్రరావు, అంబికా శివకుమార్ దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీచక్రార్చన, సహస్రనామార్చన పూజాదికాలు జరిగాయి. సోమవారం జరిగిన పూజలను రామచంద్రరావు, సోమరాజు, రాజేంద్రప్రసాద్, రేవంత్ సాయబ్రహ్మ దంపతులు నిర్వహించారు.
News Posted: 22 September, 2009
|