కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా వాసులు కలుషిత నీరు తాగి ముగ్గురు మరణించారు. కొడగండ్ల మండలం బాలుతండాలో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలో వరి పంట కోసేందుకు పొలం పనులకు వీరు వెళ్ళారు. దాహం తీర్చుకునేందుకు సమీపంలో ఉన్న కుండలోని నీటిని తాగడంతో ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ఈ సంఘటనకు ముందు ఆ కుండలో విషగుళికలు కలిపి పొలానికి పిచికారి చేసి ఆ కుండను అలానే వదిలేశారు. తర్వాత కుండలో నీటిని నింపారు. ఇది తెలియక పొలం పనులకు వెళ్ళినవారు ఆ నీటిని తాగడంతో ఈ ప్రమాందం జరిగింది. ప్రాణాలతో విలవిలలాడుతున్న వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
News Posted: 23 September, 2009
|