మారుమ్రోగిన లలితా సహస్రనామం
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసిన శ్రీకనకదుర్గమ్మవారు నవరాత్రుల సందర్భంగా బుధవారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లలితంగా, పరమశాంత స్వరూపంతో ఉన్న అమ్మను వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకే అమ్మవారి సర్వదర్శనం ప్రారంభమైంది. తలనీలాలు సర్పించి, దుర్గాఘాట్ లో పుణ్యస్నానాలు ఆచరించి, రక్షమాం లలితాంబికా అంటూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వచ్చారు. దుర్గమ్మను లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిండంతో భక్తజనం అమ్మవారికి లలితా సహస్రనామార్చన, కుంకుమార్చనలు చేశారు.
News Posted: 24 September, 2009
|