ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ళ సమీపంలోని ఎన్ హెచ్-5పై లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. ఇటుక లోడుతో వెళ్తున్న లారీ పట్టుతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను తూర్పుగోదావరి జిల్లా మండపేట వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.