పండ్లతోటలపై అవగాహన సదస్సు
అనంతపురం : పండ్లతోటల సాగులో చిన్నచిన్న మెళుకువులతో మేలైన పద్ధతులు పాటించడం ద్వారా నాణ్యమైన పంట సాధించడానికి ఆస్కారం ఉంటుందని ఉద్యానవన అధికారులు, శాస్తవ్రేత్తలు రైతులకు సూచించారు. ఈ మేరకు బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో గ్రేడింగ్, ప్యాకింగ్, వర్షాభావ పరిస్థితుల్లో పాటించాల్సిన అంశాలపై పండ్లతోటల రైతులకు ఒక్క రోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఉద్యానశాఖ జిల్లా సహాయ సంచాలకులు వై.విద్యాశంకర్ అధ్యక్షతన జరిగిన వర్క్షాపులో మార్కెట్యార్డు చైర్మన్ నాగభూషణరెడ్డి, ఉద్యానశాఖ ఎడి హరినాథ్రెడ్డి, బెంగళూరు ఐఐహెచ్ఆర్ శాస్తవ్రేత్త డాక్టర్ సుధాకర్రావు, డాట్ సెంటర్ శాస్తవ్రేత్త డాక్టర్ లక్ష్మిరెడ్డి, తిరుపతి చినీ నిమ్మ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్త డాక్టర్ గోపాల్, శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్గుప్తా, వైస్ ప్రిన్సిపాల్ టి.చెన్నా రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడి విద్యాశంకర్ మాట్లాడుతూ జిల్లాలో రోజు రోజుకు విస్తరిస్తున్న పండ్లతోటల సాగులో భాగంగా రైతులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధానంగా మార్కెట్ సమస్యలు తీర్చాలన్న దానిపై దృష్టి సారించామన్నారు.
శాస్తవ్రేత్తలు మాట్లాడుతూ ప్రధానంగా రైతులు పంట ఉత్పాదకతను పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంట ఉత్పత్తులు, కల్తీలేని దిగుబడులు వస్తాయని ఫలితంగా మంచి మార్కెట్ ధరలు చేతికి వస్తాయన్నారు. విచ్చలవిడిగా రసాయన, పురుగు మందుల వాడకం ద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని తద్వారా పెట్టుబడులు వ్యయం అధికమై నష్టపోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అవగాహన లోపంతో చేపడుతున్న చర్యల కారణంగా పండ్లతోటల్లో నష్టాలు వస్తున్నట్లు గమనించామన్నారు. వీటన్నింటినీ రైతులు అధిగ మిస్తే పండ్లతోటలు లాభదాయకంగా మారుతాయన్నారు. పండ్లతోటల ఎంపిక, నాణ్యమైన మొక్కలు, నాటడం, నీటి నిర్వహణ, పోషక యాజమా న్యం, సస్యరక్షణ, కొమ్మల కత్తిరింపులు, కాయకోత, తదుపరి ఆచరించాల్సిన పద్ధతులు, మార్కెటింగ్, రవాణా తదితర అన్ని అంశాలలో రైతులకు ఈ సందర్భంగా శాస్తవ్రేత్తలు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
News Posted: 24 September, 2009
|