పావురాల గుట్టకు వైఎస్ అభిమానులు
కర్నూలు : నల్లమల అడవులకు జగన్ పర్యటన ఖరారైన నేపథ్యంలో పావురాల గుట్టను సందర్శించడానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు బయలుదేరారు. తమ ప్రియతమ నేత మరణించిన సంఘటనా స్థలాన్ని ఎంత కష్టమైనా చూడాల్సిందేనంటూ అభిమానులు నల్లమల కీకారణ్యంలోకి వలసలు పట్టారు. కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల నుంచి అభిమానులు ఒక రోజు ముందుగానే పావురాల గుట్టకు తరలివెళ్తున్నారు.
News Posted: 24 September, 2009
|