26నుంచి రైతు మహాసభలు
తిరుపతి : స్థానిక ప్రెస్ క్లబ్ లో రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రైతు మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విజయవాడలో ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకండ్రిక, కెవీబీపురం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఖరీఫ్ సీజన్ లో పంట ఎండి రైతులు నష్టపోయారని, రబీలోనైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు జి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 24 September, 2009
|