స్కంధమాతగా భ్రామరి
శ్రీశైలం : నవదుర్గ అలంకారంలో శ్రీశైల భ్రామరీ దేవి స్కంధమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. స్కంధమాత అలంకారంలో అమ్మవారి ఒడిలో కుమారస్వామికూర్చొని ఉంటాడు. చతుర్భుజాలు కలిగి రెండుచేతుల్లో పద్మాలు, ఒక చేయి అభయహస్తంగా, మరో చేతితో కుమారస్వామిని పట్టుకొని ఉన్నట్లుగా ఈ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనచ్చారు. ప్రత్యేక పూజల్లో భాగంగా భ్రమరాంబికాదేవికి నవార్పణలు, స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, చండీహోమం, రుద్రహోమాలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఇన్ చార్జి ఈవో రమేష్, ఆలయ అధికారులు బ్రహ్మయ్య, ప్రధానార్చకులు రాజయ్యస్వామి, వీరయ్యస్వామి, ఉమామహేశ్వర ప్రసాద్, వేదపండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
News Posted: 24 September, 2009
|