విజయవాడ :ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల సందర్భంగా విజయదశమి రోజున శమీ వృక్షాన్ని (జమ్మి) పూజిస్తారు. దుర్గతులను నివారించే శక్తి స్వరూపిణిగా కనకదుర్గమ్మ తల్లి భక్తుల పూజలందుకొంటున్నది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచినట్లు మహాభారతంలో ప్రస్తావించారు. అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన తన గాండీవాన్ని తీసుకుని అమిత శౌర్యంతో కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడతాడు. పాండవుల విజయ చిహ్నంగా ఆనాటి నుంచి విజయదశమినాడు శమీపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.