ప్రత్యూషకు ఘన స్వాగతం
రాజమండ్రి : జాతీయ జూనియర్ చదరంగం అండర్ -19 మహిళా విభాగంలో బొడ్డా ప్రత్యూష కాంస్య పతకం సాధించింది. చైన్నై నుంచి బొకారో ఎక్స్ ప్రెస్ లో తునికి వచ్చిన ఆమెకు మంగళవారం రైల్వే స్టేషన్ ఆవరణలో ఘన స్వాగతం లభించింది. ఈనెల 19 నుంచి 28 వరకు జరిగిన చదరంగం పోటీలో ఆమె ఈ పతకాన్ని సాధించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 120 మంది క్రీడాకారిణులు పాల్గొనగా 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి కాంస్య పతకం గెలుచుకుందని ఆమె తండ్రి మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే ఏడాది జూలై 24న టర్కీలో జరిగే వరల్డ్ యూత్ అండర్ - 16 చెస్ ఒలింబియాడ్, ఆగస్టు 2న పోలండ్ లో జరిగే వరల్డ్ జూనియర్ అండర్ - 20 చెస్ చాంపియన్, అక్టోబర్ 19న గ్రీస్ లో జరిగే వరల్డ్ యూత్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె పాల్గొంటున్నట్లు తెలిపారు.
News Posted: 30 September, 2009
|