హైదరాబాదు : కర్నూలు జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి. వరదలు పొటెత్తడంతో చాలా గ్రామాలు నీటిలో మునిగి పోయాయి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకు పోవడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలాలోకి నీరు చేరుకోవడంతో ప్రజలంతా భయంతో ఇళ్లపైకి చేరుకున్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారయింది. ఎక్కడికక్కడే విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి. జాయింట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.