13హుండీల్లో నగదు రూ.85 లక్షలు
విజయవాడ : దసరా నరవాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించారు. ఆలయ పరిధిలోని 13 హుండీలను లెక్కించగా నగదు రూపంలో 85,46,128, ఆభరణాల రూపంలో 282 గ్రాముల బంగారం, వెండి 4505 కేజీలు, 50 యూఎస్ డాలర్లు ఆదాయంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన హుండీలను కూడా ఈ వారంలోలెక్కించనున్నట్లు ఆలయ ఈఓ గోపాలకృష్ణా రెడ్డి తెలిపారు.
News Posted: 1 October, 2009
|