కర్నూలు : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న పాలమూరు జిల్లాలోని ప్రసిద్ద అలంపూర్ శక్తిపీఠం పూర్తిగా నీట మునిగింది. తుంగభద్ర పోటెత్తడంతో పాటు జిల్లాలో భారీగా కురుస్తున్న వానల వల్ల నీరు ఇళ్ళల్లోకి చేరుకోవడంతో ప్రజలు భయాందోళలకు గురై మిద్దెలపైకి చేరుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ ఎరగని రీతిలో శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు..