కర్నూలు : వరద నీటితో మునిగిన కర్నూలు పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తుంగభద్రా నదిలో వరద ఉధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే నీట మునిగిన గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరద నీటిలో చిక్కుకున్న 15 మంది మహిళలను మత్స్యకారులు రక్షించి ఒడ్డుకు చేర్చారు.