కర్నూలు : కర్నూలులో వరద ఉధృతి తగ్గడంతో ప్రజలు కాస్తంత ఊరట చెందుతున్నారు. అయినా ప్రజలకు వరద భయం వీడలేదు. ఈలోగా మరో వైపు వరద ఉధృతికి కొట్టుకొచ్చిన మొసళ్ళు ప్రజలను భయప్రాంతాలుకు గురి చేస్తున్నాయి. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు వద్ద వరద నీటిలో మూడు మొసళ్ళు కొట్టుకొచ్చాయి. దీంతో అక్కడి వారు భయందోళనలకు గుర్యయారు. ప్రజలెవరూ నీటిలోకి దిగవద్దని అధికారులు అదేశాలు జారీ చేశారు.