నీట మునిగిన 6వేల ఎకరాల పంట
విజయవాడ : కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోవరద ముంపు గల 16 మండలాల పరిధిలో 6 వేల ఎకరాలు వరద తాకిడికి గురయ్యాయి. కూరగాయల తోటలతో పాటు, పసుపు, పత్తి, కంద, అరటి, తమలపాకు, వరి పంటలు నీటిపాలయ్యాయి. వందల ఇళ్ళు పూర్తిగా దెబ్బతినగా, మరి కొన్ని ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.
News Posted: 5 October, 2009
|