విజయవాడ: అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక వద్ద సోమవారం ఓ పడవ బోల్తా పడడంతో నలుగురు గల్లంతు అయ్యారు. పద్దెనిమిది మంది లంక ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా పడవ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. వీరిలో నలుగురు గల్లంతు అయినట్లు సమాచారం. గల్లంతు అయినవారిని గాలించేందుకు గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.