గుంటూరు : గుంటూరును వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలో దాదాపు పది మండలాలు జల విలయంతో అల్లాడుతున్నాయి. గుంటూరు జిల్లా బెల్లం కొండ మండలం కోళ్ళూరు వద్ద వరద ఉధృతికి నలుగురు గల్లంతు అయ్యారు. వీరంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.