గుంటూరు : ఏ క్షణంలోనైనా కృష్ణ నది కరకట్టలు తెంచుకుని ఊళ్ళ మీద పడే ప్రమాదం ఉందని జిల్లా కలెకటర్ ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రత్యేక అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. కరకట్టలకు వెంటనే మర్మ్మత్తులు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని కరకట్టలు తెంచుకోవడంతో తీరప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దివిసీమ వాసులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా రు.