గుంటూరు : రేపల్లెలోని పెనుమూడి వారధి దగ్గర కృష్ణ కరకట్టకు గండిపడి పన్నెండు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనితో రక్షణ దళాలు రంగంలోకి దిగి ఆయా గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కరకట్టకు పడిన గండి పూడ్చలేని పరిస్థితి నెలకొనడంతో వరద నీరు రేపల్లెను తాకవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వరద ఉధృతితో ఉరికి వస్తున్న నీరు ఓలేరు గ్రామాన్ని పూర్తిగా ముంచేసింది. దీనితో అధికారులు ఓలేరు గ్రామంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.