రేపల్లె జైలు జలయమం
రేపల్లె : ఓటేరు వద్ద కృష్ణ కరకట్టకు గండి పడడంతో వరద నీరు పోటెత్తి రేపల్లెను ముంచెత్తుతోంది. వరద ఉధృతికి గుంటూరు జిల్లా రేపల్లె జైలు పూర్తిగా నీట మునిగింది. దీంతో అధికారులు జైల్లో ఉన్న 23 మంది ఖైదీలను తెనాలి జైలుకు తరలించారు. కాగా రైల్వేస్టేషన్, అగ్నిమాపక కార్యాలయం జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని కోరుతున్నారు.
News Posted: 7 October, 2009
|