తిరుపతి : ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదానికి కొరత ఏర్పడింది. వారాంతపు సెలవులకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా సిఫార్సు లేఖలకు లడ్డూలను మంజూరు చేయడం నిలిపివేశామని దేవస్థానం అధికారులు తెలిపారు. పోటులో పనిచేసే కార్మికులు సెలవులపై వెళ్ళడంతో లడ్డూల ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిందిని టీటీడీ తెలిపంది.