రేపల్లె : ఓలేరు వద్ద వరద కరకట్టకు గండిపడి వరద ముంపుకు గురైన రేపల్లె పట్టణం తేరుకుంటోంది. నేటి నుంచి రాకపోకలు యథావిధిగా సాగుతాయని అధికారులు పేర్కొన్నారు. పెనుమూడి రేవు వద్ద కృష్ణానది కరకట్ట గండికి వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. సబ్ స్టేషన్ నీట మునగడంతో ఆగిపోయిన విద్యుత్ సరఫరాను మంత్రి మోపిదేవి చొరవతో ఎలక్ట్రిసిటి అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నిత్యావసర ధరలు ఆకాశన్నంటటంతో ధరలను అదుపులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.