దాడులను సహించం: డీజీపీ
విజయవాడ : రాష్ట్రంలో మహిళలు, యువతులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని డీజీపీ గిరీష్ కుమార్ హెచ్చరించారు. దాడులను అరికట్టేందుక ప్రత్యేక చర్యలుతీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు గిరీష్ కుమార్ తెలిపారు. పోలీసు శాఖలో అవినీతిని రూపుమాపైందుకు సరైన చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో మరో మూడు నెలల్లో అదనంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో సంస్కరణలేమీ చేయడం లేదని అన్నారు. ఇతర శాఖలతో పోలిస్తే పోలీస్ శాఖలో అవినీతి తక్కువేనని ఆయన అన్నారు. నగర పోలీస్ క్వార్టర్స్ అభివృద్ధికి నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్లపై విజయవాడ విచ్చేసిన డీజీపీ మీడియా సమావేశంలో పై విధంగా మాట్లాడారు.
News Posted: 9 October, 2009
|