గుంటూరు : ముంపు ప్రాంతాలకు ఆహారం తీసుకువెళ్తున్నవాహనం బోల్తా పడడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. తెనాలిమండలం పెద్దరావూరులో వరద బాధితులకు తీసుకువెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఎనిమిది మంది గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను తెనాలి ఆస్పత్రికి తరలించారు.