కళ్యాణమస్తుపై అవగాహన సదస్సులు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్ధానం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణమస్తు కార్యక్రమంపై శుక్రవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. అదే రోజు కడప, విజయనగరం జిల్లాల్లో శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో సదస్సులు జరుగుతాయి. బుధవారం అనంతపురం జిల్లా కేంద్రలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని పార్టీల ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, మహిళా సంఘాలు, ప్రజలు పాల్గొనవచ్చని టీటీడీ ప్రజా సంబందిత అధికారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంకోసం జిల్లాల కేంద్రాల్లో అన్నిఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
News Posted: 13 October, 2009
|