తిరుపతి : తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో మంగళవారం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ విషయంలో ద్వితీయ సంవత్సరపు విద్యార్థిని సీనియర్లు చితకబాదారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.