తిరుమల : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేకంటేశ్వరస్వామిని డీజీపీ గిరీష్ కుమార్ బుధవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద్ర్భంలో ఆయన మీడియాతోమాట్లాడుతూ పోలీసుల్లో బాధ్యత పెంచే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కాగా స్వామివారి దర్శనానికి సుమారు అయిదు గంటల సమయం పడుతోంది.