తిరుపతి : పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువున్న ఓ విద్యార్దిని గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. గాయత్రి బ్లాక్ హాస్టల్ లో ఉంటున్న జోత్న్స పరీక్షల్లో తక్కువ పర్సంటేజి వచ్చిందనే బాధతో ఆత్మహత్యకు పూనుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.