కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్య
విజయవాడ : జిల్లాలోని నందిగాం మండలం, నవాబ్ పేటలో కాంగ్రెస్ నేత గింజుపల్లి వీరయ్య సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేట కొడవళ్ళతో హతమార్చినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బుచ్చయ్య చౌదరి హత్య కేసులో వీరయ్య ప్రధాన అనుమానితుడు. వీరయ్య మృతితో నవాబ్ పేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శివాలయంలో పడివున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 19 October, 2009
|