తిరుపతి : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి బెంగళూరుకు చెందిన ఎ.జె.మోహన్ అనే భక్తుడు 55 లక్షల రూపాయలు విలువచేసే బంగారు పళ్ళేలను ఆలయంలో అధికారులకు సోమవారం ఉదయం అందజేశారు. మూంబాయికి చెందిన మరో భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గానూ 99 లక్షల రూపాయల విరాళాన్ని జేఈవో ధర్మారెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు.