28న కలెక్టర్ పర్యటన
విజయవాడ : వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృంద పర్యటించనుందని కలెక్టర్ పీయూష్మార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2వతేది నుండి కృష్ణానది వరద దృశ్యాలు, బాధితుల పునరావాసాలకు తరలింపు, సహాయక చర్యలు, కరకట్టల పరిరక్షణ చర్యలు తదితర అంశాలపై సమాచారశాఖ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వరద నష్టం కేంద్ర బృందానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తారు. తదుపరి సమీపంలో ఫెర్రి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడతారు. అనంతరం జూపూడి వెళతారు. అలానే విజయవాడలో వరద ముంపునకు గురైన కృష్ణలంక, యనమలకుదురు, రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, భద్రిరా జుపాలెం తదితర గ్రామాల్లో పర్యటిస్తారు.
News Posted: 27 October, 2009
|